కులకచర్ల, ఏప్రిల్ 2 : తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకం గర్భిణులకు వరంగా మారింది. పైసా ఖర్చులేకుండా దవాఖానల్లో మెరుగైన వైద్యసేవలతోపాటు కాన్పు తర్వాత 102 వాహనంలో ఇంటికి చేర్చుతున్నారు. ప్రతీ నెలా పరీక్షలు చేసి, తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
102 సేవలు..
గర్భం దాల్చినప్పటి నుంచి 9 నెలల వరకు నాలుగుసార్లు వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆటోలు, జీపులు, ఇతర వాహనాల్లో వెళ్తుంటారు. సమయానికి చేరుకోక అనర్థాలు జరిగేవి. దీన్ని దృష్టిలో పెట్టుకుని 102 వాహనాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఏఎన్ఎంలు గ్రామంలో ఎంత మంది గర్బిణులు ఉన్నారు? ఎందరు పరీక్షలు చేయించుకుంటున్నారన్న వివరాలను సేకరించి 102 వాహనాలకు ఫోన్ చేయాలి. నాలుగు సార్లు వైద్య పరీక్షల కోసం 102 వాహనాలను వినియోగించుకోవచ్చు, వైద్య పరీక్షలు సక్రమంగా జరిగితే కాన్పు సమయంలో ఎలాంటి ఇబ్బందులు వాటిల్లవని వైద్యులు సూచిస్తున్నారు.
కాన్పు తర్వాత కూడా..
ప్రభుత్వ దవాఖానల్లో కాన్పు తర్వాత 102 వాహనం సురక్షితంగా ఇంటికి చేర్చుతున్నది. ఇందుకోసం స్వయంగా వారే 102కు ఫోన్చేసి పిలిపించుకోవచ్చు, సాధారణ కాన్పు(నార్మల్ డెలివరీ) అయిన వారిని 48 గంటల తర్వాత, సిజేరియన్ అయిన వారిని వారం తర్వాత ఇంటికి వెళ్లెందుకు 102 సేవలు అందిస్తున్నది.
ఇవీ కూడా చదవండి
అప్పటి వరకూ వేతనాల చెల్లింపుల్లో నో చేంజ్!
‘ఫ్యూచర్ రిటైల్’కు ‘మొండి బాకీ’ ట్యాగ్ తప్పదా?!
ఇన్వెస్టర్లూ.. బీ వేర్: ఏప్రిల్లో 11 రోజులు సెలవులే!
మగ ఉద్యోగులకు 24 వారాల పేరెంటల్ లీవ్.. వోల్వో ఇండియా నిర్ణయం