పెద్దేముల్, ఏప్రిల్ 2 : కరోనా వైరస్ నిర్మూలనకు 45 ఏండ్లు పైబడినవారు తప్పనిసరిగా టీకాను వేయించుకోవాలని పెద్దేముల్ సర్పంచ్ ద్యావరి విజయమ్మ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సర్పంచ్తో పాటు పలువురికి వైద్య సిబ్బంది వ్యాక్సిన్ను వేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కరోనా వైరస్ను నివారించడానికి ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని అన్నారు. వైరస్ నిర్మూలనకు స్వచ్ఛందంగా టీకాను వేయించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి శ్రావణ్ కుమార్రెడ్డి, పెద్దేముల్ సొసైటీ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జితేందర్రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కులకచర్లలో 30మందికి..
కులకచర్ల, ఏప్రిల్ 2 : కులకచర్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 30మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారని కులకచర్ల మండల వైద్యాధికారి డాక్టర్ మురళీకృష్ణ, సీహెచ్వో చంద్రప్రకాశ్ తెలిపారు. 45 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకాను తీసుకోవాలని సూచించారు.
ఒకరికి కరోనా పాజిటివ్
కులకచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 28మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో ఒకరికి పాజిటివ్ అనితేలిందని వైద్యాధికారి డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, కరోనా లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ దవాఖానలో కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు.
దోమ మండలంలో ఇద్దరికి..
దోమ, ఏప్రిల్ 2 : మండల పరిధిలో ఇద్దరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని ప్రభుత్వ వైద్యాధికారి మునీబ్ తెలిపారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన 15 మందికి దోమ ప్రభుత్వ దవాఖానలో కరోనా పరీక్షలు చేయగా, ఇద్దరికి పాజిటివ్గా నిర్ధారణ అయిందని ప్రభుత్వ వైద్యాధికారి మునీబ్ తెలిపారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అపోహలను నమ్మవద్దు
యాలాల, ఏప్రిల్ 2 : కొవిడ్ వ్యాక్సిన్పై ప్రజలు అపోహలను నమ్మవద్దని ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వం కరోనా నియంత్రణలో భాగంగా ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లో ఎంపీపీ వ్యాక్సిన్ తీసుకున్నారు. టీకా ఇచ్చేందుకు ఆరోగ్య సిబ్బంది పూర్తి ఏర్పాట్లను చేశారన్నారు. మే 31 వరకు ప్రజలందరూ లాక్డౌన్ నిబంధనలను పాటించాలన్నారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ చంద్రశేఖర్, ప్రైమరీ హెల్త్ నర్స్ అరుణకుమారి, సూపర్వైజర్ సుచిత్ర, స్టాఫ్ నర్స్ సుజాత పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి
ఒప్పో F19 రిలీజ్ డేట్ ఫిక్స్
కేకేఆర్ బ్యాట్స్మన్ నితీశ్ రాణాకు కరోనా నెగెటివ్
పబ్జీ యూజర్లకు మరో బ్యాడ్ న్యూస్!
ఏప్రిల్లో భారత్లో విడుదలయ్యే టాప్ స్మార్ట్ఫోన్లు ఇవే!
భారత్లో శాంసంగ్ టీవీ ప్లస్ లాంచ్.. 100% ఉచితం