బొంరాస్పేట, ఏప్రిల్ 1 : కరోనా నిర్మూలన కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న టీకాను తప్పనిసరి వేసుకోవాలని మండల వైద్యాధికారి రవీంద్ర యాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 45 ఏండ్లు పైబడిన 70 మందికి వైద్య సిబ్బంది టీకా వేశారు. అనంతరం అరగంట పాటు వ్యాక్సిన్ తీసుకున్న వారిని పరిశీలనలో ఉంచిన తర్వాత తిరిగి వారిని ఇండ్లకు పంపించినట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా మాజీ వైస్ ఎంపీపీలు రామకృష్ణయాదవ్, నర్సిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు లచ్చప్ప, సుభాష్రావు, శ్యామలయ్యగౌడ్ తదితరులు టీకా తీసుకున్నారు. కార్యక్రమంలో సీహెచ్వో శివరాజ్, హెల్త్ ఎడ్యుకేటర్ భాస్కరాచారి, సిబ్బంది పాల్గొన్నారు.
ఒకరికి పాజిటివ్
మండల కేంద్రంలోని పీహెచ్సీలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 30 మందికి ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించగా, బాపల్లితండాకు చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్గా తేలిందని వైద్యాధికారి రవీంద్ర యాదవ్ వివరించారు. కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
కరోనా మహమ్మారిని తరిమికొట్టాలి
45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని రామయ్యగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు వినోద్రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో కొవిడ్ టీకా వేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు వినోద్రెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు.
ధారూరు, నాగసముందర్ కేంద్రాల్లో..
ధారూరు మండల పరిధిలోని 45 సంవత్సరాలు పై బడిన వారు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని ధారూరు, నాగసముందర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు రాజు, రమేష్ అన్నారు. గురువారం ధారూరు మండల పరిధిలోని నాగసముందర్లో 45సంవత్సరాలు పైబడిన వారికి 38మందికి, ధారూరులో 10మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. కార్యక్రమంలో దవాఖాన సిబ్బంది, నాయకులు, ఆశావర్కర్లు ఉన్నారు.
ఇవీ కూడా చదవండీ..
మాస్క్ కిందికి.. నేను పైకి.. ముంబై పోలీసుల వినూత్న ప్రచారం
బ్యాంక్ బిల్డింగ్లో భారీ అగ్ని ప్రమాదం