పూడూరు, ఏప్రిల్ 1 : కరోనా వైరస్ నివారణకు 45 ఏండ్లు పైబడిన వారు తప్పనిసరిగా టీకాను వేయించుకోవాలని సర్పంచ్ పి.నవ్యరెడ్డి అన్నారు. గురువారం పూడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు సర్పంచ్ నవ్యరెడ్డితో పాటు గ్రామానికి చెందిన 15మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నవ్యరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భౌతికదూరం పటిస్తూ మాస్కులు ధరించాలన్నారు. టీకా తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావని చెప్పారు. ఆమె వెంట సొసైటీ మాజీ చైర్మన్ నర్సింహారెడ్డి, డాక్టర్ రవీందర్రెడ్డి, గ్రామస్తులు, వైద్యసిబ్బంది ఉన్నారు.
కులకచర్ల పీహెచ్సీలో 114మందికి ..
కులకచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం 114మందికి కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు కులకచర్ల మండల వైద్యాధికారి డాక్టర్ మురళీకృష్ణ, సీహెచ్వో చంద్రప్రకాశ్ తెలిపారు. 45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు కరణం ప్రహ్లాద్రావు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మహిపాల్, గ్రామస్తులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.