వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన వకుళాభరణం కృష్ణ మోహన్రావు, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్ను సోమవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సన్మానించారు. ఎమ్మెల్యేతో పాటు వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేశ్కుమార్, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డితో పాటు పలువురు సన్మానం చేసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్కు ఎంపీ రంజిత్రెడ్డి శుభాకాంక్షలు..
తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు వికారాబాద్ వాసి శుభప్రద్పటేల్ను చేవెళ్ల పార్లమెంటు సభ్యులు రంజిత్రెడ్డి శాలువాతో ఘనంగా సన్మాణం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.