ధారూరు, మార్చి18 : పని కోసం వెళ్తున్నానని ఇంట్లో వారికి చెప్పి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఓ యువకడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా ధారూరు మండలం చింతకుంటలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చింతకుంట గ్రామానికి చెందిన జోగు హరీశ్ (20) గత వారం రోజుల క్రితం తన తల్లితో హైదరాబాద్కు పని కోసం వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు హరీశ్తో మాట్లాడుదామని ఫోన్ చేయగా కలవడకపోవడంతో వారికి తెలిసిన బంధువులు, స్నేహితులను విచారించగా ఆచూకీ లభించలేదు.
నాగారం గ్రామానికి చెందిన మహేష్ అటవీ ప్రాంతంలో పశువులను మేపుతుండగా చెట్టుకు ఉరి వేసుకున్న వ్యక్తి మృతదేహానని గుర్తించి చింతకుంట గ్రామస్తులకు తెలియజేశాడు. వెంటనే గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకొని హరీశ్ వృతదేహంగా గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. ఎస్ఐ నరేందర్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకోని మృతదేహన్ని పరిశీలించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.