మోమిన్పేట : వర్షాకాలం ప్రారంభం అయినందునా గ్రామంలో పారిశుధ్య సమస్యలతో పాటు తదితర సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య తెలిపారు. గురువారం మోమిన్పేట మండల పరిధిలోని దేవరంపల్లి గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ గ్రామంలో ఇండ్ల మధ్యన పెంటకుప్పలు, మురుగు నిలువకుండా ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు.
సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టి, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రకృతి వనంలో మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతలు తీసుకోవాలని వివరించారు. గ్రామంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని పేర్కొన్నారు. ఆయన వెంట సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీవో యాదగిరి, వెంకటేశం ఉన్నారు.