వికారాబాద్ : సెప్టెంబర్ 2 నుంచి మండలాల్లోని ప్రతి గ్రామంలో మున్సిపల్లోని ప్రతి వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. శనివారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ మండలాల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ పురపాలక శాఖ మంత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు గ్రామ కమిటీలు, మున్సిపల్ వార్డు కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం అందరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, మండల అధ్యక్షులు వేణుగోపాల్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, కమాల్రెడ్డి, అనీల్లు పాల్గొన్నారు.