తాండూరు రూరల్ : తాండూరు మండలంలోని పలు గ్రామాల్లో పీర్ల (మొహర్రం) పండుగ సందర్భంగా పీర్లను చావడీల్లో కూర్చోబెట్టారు. పండుగ సందర్భంగా తారతమ్యబేధం లేకుండా కలిసి కట్టుగా గ్రామాల్లో అసైదుల ఆడుతున్నారు. మహిళలు ఆశన్నఉశన్న ఆడుతూ ఆనందంగా పీర్లపండుగను కొనసాగిస్తున్నారు. ఈ నెల 20వ తేదీన మొహర్రం పండుగ చేయనున్నారు. అదే రోజు భారీగా ఆయా గ్రామాల్లో పీర్లను ఊరేగిస్తూ చెరువుల్లో నిమజ్జనం చేసి, పండుగను ముగిస్తారు.