చేవెళ్లటౌన్ : దళిత విద్యార్థిని హత్య చేసిన నిందితున్ని అరెస్టు చేసి ఉరితీయాలని ఆలిండియా అంబేద్కర్ యువజన జిల్లా కన్వీనర్ మహేష్ అన్నారు. గురువారం చేవెళ్ల మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంటూరులో బీటెక్ దళిత విద్యార్థి రమ్యని హత్యచేసిన నిందితుల్ని అరెస్టు చేసి ఉరితీయాల డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దళితులపైన నిరంతరం దాడులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. దళితుల పైన దాడులు చేస్తున్న వారిని అరెస్టు చేసి వారిని ప్రభుత్వం శిక్షించాలని చెప్పారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల ప్రధాన కార్యదర్శి అరుణ్, ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం షాబాద్ మండల అద్యక్షుడు శ్రీనివాస్ ,మండల ఉపాధ్యక్షుడు హరిప్రసాద్, కార్యదర్శి రాఘవేందర్, నాయకులు ఉన్నారు.