తాండూరు రూరల్ : టీఆర్ఎస్ నూతన గ్రామ కమిటీలు పార్టీ పటిష్టతకు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని తాండూరు మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రాందాస్ అన్నారు. మంగళవారం మండలంలోని వీర్శెట్టిపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులుగా వీడే నాగప్ప, పర్వతాపూర్ టీఆర్ఎస్ కమిటీ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి, మిట్టబాసుపల్లి గ్రామ టీఆర్ఎస్ నూతన కమిటీ అధ్యక్షుడి బాబ ఇస్మాయిల్ను ఆయా గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ఉమాశంకర్, మహిళా నాయకురాలు శకుంతల, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రాములు, సర్పంచులు బీడేనాగప్ప, నరేందర్ రెడ్డి, జగదీష్, ద్యావరి నరేందర్రెడ్డి, సాయిలు మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లప్ప, నాయకులు కోతి గోపాల్ ఉన్నారు.
గ్రామాల్లో నూతన కమిటీల ఏర్పాటు
మండలంలోని జినుగుర్తి గ్రామ టీఆర్ఎస్ కమిటీ అధ్యక్షులుగా శ్యామప్ప, రాంపూర్ అధ్యక్షులుగా పురుషోత్తం, చెన్గేష్పూర్లో శ్రీశైలం గౌడ్లను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రవీందర్గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్ ఉన్నారు.