వికారాబాద్ : నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ నిలుస్తున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణంలోని 13 మంది లబ్ధిదారులకు సీఎంరిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు సంజీవని లాంటిదన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల ఆరోగ్య శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కింద నిధులు మంజూరు చేస్తొందన్నారు.
ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఎలాంటి ఆపద సంభవించిన నేనున్నాను అనే ధైర్యం నింపుతు అండగా నిలుస్తున్నారని గుర్తు చేశారు. 13మంది లబ్ధిదారులకు రూ. 4,76,500లను చెక్కుల రూపంలో అందజేశామన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పాండు, కౌన్సిలర్లు అనంత్రెడ్డి, రామస్వామి, నర్సింహులు, మాజీ జడ్పీటీసీ ముత్తహర్షరీఫ్, ఉపాధ్యక్షులు వేణుగోపాల్, నాయకులు పాల్గొన్నారు.