పెద్దేముల్ : మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన కోట్ల మైసమ్మకు గ్రామస్తులు ఘనంగా బోనాలను సమర్పించారు. బోనాల సందర్భంగా నైవేద్యాలతో బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వర్షాలు కార్యక్రమంలో సర్పంచ్ ద్యావరి విజయమ్మ, ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, పెద్దేముల్ సొసైటీ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి, గ్రామ పెద్దలు జితేందర్ రెడ్డి, నరేష్రెడ్డి, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.