పరిగి, ఏప్రిల్ 27 : తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని తీసుకోవడం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని సుల్తాన్పూర్, రాఘవాపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయన్నారు. గడిచిన సంవత్సరం జిల్లాలో 29,584 ఎకరాల్లో వరి పంట సాగు చేయగా, ఈసారి 69,667 ఎకరాల్లో వరి సాగు చేశారన్నారు. అకాల వర్షం కారణంగా ధాన్యం తడవకుండా టార్పాలిన్లు తెచ్చుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా 191 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. కరోనా పరిస్థితిల్లోనూ సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలిచారన్నారు. మరిన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి గింజ వరకు కొనుగోలు చేయాలన్నారు.
ప్రజాప్రతినిధులు కొనుగోలు కేంద్రాలను సందర్శించి సమస్యలు ఉంటే పరిష్కరించాలన్నారు. వరి ధాన్యం క్వింటాలుకు రూ.1888 మద్దతు ధర ఇస్తున్నామన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలు పాటించాలని మంత్రి సూచించారు. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. అన్నదాతలు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్నారు. రైతుపక్షపాతి సీఎం కేసీఆర్ ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించారన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతీలాల్, జెడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, దోమ జెడ్పీటీసీ కొప్పుల నాగారెడ్డి, పరిగి ఎంపీపీ కే అరవిందరావు, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, సీనియర్ నాయకులు బీ ప్రవీణ్కుమార్రెడ్డి, ఏ సురేందర్కుమార్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, సర్పంచ్లు జీ అశోక్వర్దన్రెడ్డి, నల్క జగన్, గోపాల్, ఎంపీటీసీలు కే వెంకట్రాంరెడ్డి, ఉమాదేవి, నార్మాక్స్ డైరెక్టర్ పీ వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాండూరు, ఏప్రిల్ 27 : తాండూరు పట్టణంలో మంగళవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టులను కట్టడం వల్ల 1.30 కోట్ల్ల ఎకరాల్లో వరి సాగు అవుతుందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3028 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టు పేర్కొన్నారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు రైతులకు మద్దతు ధర అందుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్నాయక్, వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పెద్దేముల్ మండలం మన్సాన్పల్లి వాగులో నిర్మిస్తున్న హైలెవల్ బ్రిడ్జి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి సబితారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం తాండూరు-హైదరాబాద్ వెళ్లే మార్గంలోని మన్సాన్పల్లి వాగులో రూ.6 కోట్ల్ల 70 లక్షల నిధులతో ఆధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్న హైలెవల్ బ్రిడ్జి పనులను కలెక్టర్ పౌసుమి బసుతో కలిసి మంత్రి పరిశీలించారు. వర్షాకాలం వచ్చే సరికి నాణ్యతతో పనులను పూర్తి చేయాలని అన్నారు.