షాబాద్ : ఈ నెల 12వ తేదీ నుంచి యాదాద్రి భువనగిరిలో జరిగే రాష్ట్రస్థాయి బాలుర హాకీ టోర్నమెంట్కు జిల్లా నుంచి 18మంది క్రీడకారులు ఎంపీకైన్నట్లు రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్రావు తెలిపారు. ఎంపీకైన విద్యార్థులను గురువారం హయత్నగర్ పాఠశాలలో హాకీ అసోసియేషన్ సెక్రటరీ, స్థానిక పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ క్రీడల వలన మానసీక ఉల్లాసం, శారీరక దారుఢ్యం పెంపొందుతదన్నారు. ప్రస్తుతం పోటీల్లో పాల్గొంటున్న క్రీడకారులను పోత్రహిస్తూ విజయం సాధించాలని ఆకాక్షించారు.
అనంతరం రంగారెడ్డిజిల్లా హాకీ అసోసియేషన్ చైర్మన్ శ్రీధర్ రూ. 25వేల నగదుతో పాటు స్పోర్ట్స్ డ్రెస్ను విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవరెడ్డి, ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, భాస్కర్, మయూరి, శైలజ, సులోచన, మంజుల, హరీశ్, ఉత్తర పాల్గొన్నారు.