వికారాబాద్ : టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేసే వారికి అధిక ప్రాధాన్యతనిస్తుందని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం సాయంత్రం వికారాబాద్ క్యాంపు కార్యాలయంలో పార్టీ అధ్యక్షుల పదవీ కాలం పూర్తి అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కోట్పల్లి మండలంలో ఓగులాపూర్ గ్రామానికి చెందిన పట్లోళ్ళ నరేందర్రెడ్డిని మండల టీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎమ్మెల్యే సమక్షంలో మండల ప్రజాప్రతినిధులు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. తన ఎన్నికకు సహకరించిన అందరికి నరేందర్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతానని తెలిపారు.