పరిగి : వికారాబాద్ పట్టణం సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరంలోని తన కార్యాల యంలో వికారాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధిపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, మున్సిపల్ చైర్పర్సన్ సీహెచ్ మంజుల రమేశ్, మున్సిపల్ కమిషనర్ శరత్, ప్రజారోగ్య ఇంజనీరింగ్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీయూఎఫ్ఐడీసీ పథకంలో భాగంగా వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రూ. 6కోట్లతో చేపట్టిన 9 పనులను మంత్రి సమీక్షించారు. పూర్తి కాని పనులన్నీ సత్వరమే పూర్తి చేయించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
వికారాబాద్ పట్టణం జిల్లా కేంద్రంగా రూపుదిద్దుకున్నందున అదే స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అందుకు సంబంధించి ప్రణాళికలు రూపొందించాలని మంత్రి సూచించారు. వైకుంఠధామాలకు రూ. 2కోట్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు రూ. 4కోట్లు మంజూరు చేశామని, ఇందుకు సంబంధించి పనులు త్వరగా చేపట్టాల ని మంత్రి సూచించారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణలో భాగంగా చిన్నచిన్న వీధి వ్యాపారులు తమ కార్యకలాపాలను నిర్దేశించిన చోట నిర్వహించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వికారాబాద్ పట్టణ కేంద్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి డంపింగ్యార్డుకు అదనంగా మరో డంపింగ్యార్డు ఏర్పాటుకు అనువైన స్థలం గుర్తించాల్సిందిగా మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పట్టణ సుందరీకరణలో భాగంగా ప్రస్తుతమున్న సెంట్రల్ లైటింగ్ పోల్స్కు రోప్ లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు శివసాగర్ చెరువు వద్ద బతుకమ్మ ఘాట్ను ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి ఆదేశించారు.