తాండూరు : త్యాగానికి గుర్తుగా, హిందూ ముస్లింలు మత సామరస్యంగా జరుపుకుంటున్న పీర్ల పండుగ వేడుకలు తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రజలు భక్తిశ్రద్దలతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. గ్రామంలో ప్రతిష్టించిన పీర్లకు కులమతాలకు అతీతంగా పీర్లకు నైవేద్యాలు సమర్పించి తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. శుక్రవారం మొహరంను పురస్కరించుకొని డప్పుల దరువులతో ప్రజలు ఆడిపాడారు. మాలీజాను, షరబత్ను భక్తులకు పంపిణీ చేశారు. ఎలాంటి అవాఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.