ఖలీల్వాడి, విద్యానగర్, ఏప్రి ల్ 19: ఉమ్మడి జిల్లాలో కరోనా కేసులు వందల సం ఖ్యలో నమోదవుతున్నాయి. సోమవారం మొత్తం 1372 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 460 పాజిటివ్ కేసులు నమోదయ్యా యి. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 23, 744 కేసులు నమోదైనట్లు వైద్యులు పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్తండాలో 50 మందికి టెస్టులు నిర్వహించగా 17 మంది కి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఎంపీపీ బానోత్ అనూష తెలిపారు. కోటగిరి మండలం లో 35 మంది కరోనా బారిన పడ్డారని డాక్టర్ సమత, సూపర్వైజర్ కృష్ణవేణి తెలిపారు. ఇందల్వాయి పీహెచ్సీలో 28 మందికి పాజిటివ్ వచ్చిందని డాక్టర్ శుభాకర్ తెలిపారు. ధర్పల్లి ప్రభుత్వ దవాఖానలో 130 మందికి టెస్టులు నిర్వహించగా 61 మందికి పాజిటివ్గానిర్ధారణ అయ్యిందని డాక్టర్ రఘువీర్ తెలిపారు. మోస్రా పీహెచ్సీలో 226 మందికి టెస్టులు నిర్వహించగా 52 మందికి, వర్నిలో 132 మం దికి టెస్టులు నిర్వహించగా 37 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్యులు స్వప్న, వెంకన్న తెలిపారు.మాక్లూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 86 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 12 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యుడు సంజీవ్రెడ్డి తెలిపారు.
రెంజల్ పీహెచ్సీలో 148 మందికి పరీక్షలు నిర్వహించగా, 24 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. తాడ్బిలోలి గ్రామంలో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో 264 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 70 మందికి పాజిటివ్గా నిర్దారణ అయ్యింది. రాకాసీపేట్లోని అర్బన్హెల్త్ సెంటర్లో 151మందికి పరీక్షలు నిర్వహించగా.. 53మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యు లు తెలిపారు.ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 214మందికి పరీక్షలు నిర్వహించగా.. 52మందికి పాజిటివ్గా నిర్దారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. మోర్తాడ్ సీహెచ్సీలో 112 మందికి టెస్ట్లు నిర్వహించగా 20 మందికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ సుమంత్ తెలిపారు. కమ్మర్పల్లి మండలంలోని చౌట్పల్లి పీహెచ్సీలో 159 మందికి టెస్ట్లు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ రతన్సింగ్ తెలిపారు. కమ్మర్పల్లి పీహెచ్సీలో 223 మందికి టెస్ట్లు నిర్వహించగా 31 మందికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ నరసింహస్వామి తెలిపారు. ఆర్మూర్ ఏరియా దవాఖానలో 155 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 35 మందికి, ప్రైమరీ హెల్త్ సెంటర్లో 90 మందికి పరీక్షలు నిర్వహించగా.. 16 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యు లు తెలిపారు. రెంజల్ మండలంలోని నీలా గ్రామంలో కరోనాతో ఒకరు మృతి చెందినట్లు గ్రామస్తులు సోమవారం తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో..
కామారెడ్డి జిల్లాలో 3637 మందికి పరీక్షలు నిర్వహించగా.. 912 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 21,274 కేసులు నమోదయ్యాయి. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని వైద్యులు సూచించారు.
కొనసాగుతున్న వ్యాక్సినేషన్
ఉమ్మడి జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. సోమవారం నిజామాబాద్ జిల్లాలో 6263 మందికి కరోనా టీకా వేసుకున్నట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో 30 కేంద్రాల్లో నాలుగు వేల మందికి గాను 4,361 మందికి వ్యాక్సిన్ వేసినట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా మాస్కు ధరించకుండా ఉన్న వారి నుంచి జరిమానా రూపంలో రూ.62,450 వసూలు చేసినట్లు తెలిపారు.
ఇవీ కూడా చదవండి…
వ్యాక్సినేషన్కు స్పందన బాగున్నది