వికారాబాద్ : పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ పోలీస్ అధికారులను ఆదేశించారు. గురువారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు కేసులకు సంబంధించిన సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అధికారులు ఫంక్షనల్ వర్టీకల్స్లో ఎవరూ కూడా నిర్లక్ష్యం వహించరాదని, పోలీస్ స్టేషన్లో అందరూ 5ఎస్ పద్ధతిని పాటించాలని సూచించారు. వర్టీకల్స్ నిర్వహణలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
డైల్ 100 కాల్స్పై ఎవ్వరూ కూడా నిర్లక్ష్యం చేయొద్దని, 100 డైల్ చేసిన ఫిర్యాదు దారులకు పోలీస్ అధికారులు వెంటనే స్పందించి పోలీస్ శాఖపైన వారికి నమ్మకం కలిగించి, పోలీస్ శాఖ తమ వెంట ఉంది అనే ధైర్యాన్ని నింపాలన్నారు. కేసుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించకూడదని, కేసులను పెండింగ్లో ఉంచకుండా వెంటనే పూర్తి చేసి ఫిర్యాదు దారులకు న్యాయం చేయాలన్నారు. జిల్లాలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లు, డీఎస్పీలు తమ పరిధిలోని పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులలో పురోగతి సాధించి నేరస్తులకు శిక్షలు పడే విధంగా చేయాలని తెలిపారు.
ఈ పెట్టి కేసులు, ఈ చలాన్లపై దృష్టి సారించాలని, ప్రజలకు సీసీటీవీలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రజలకు కళాజాత బృందంతో షీటీమ్ల ద్వారా 100 డైల్, మహిళలపై జరిగే నేరాల గురించి అవగాహన, మూఢనమ్మకాలు, రైతు ఆత్మహత్యలు తదితర విషయాల పూర్తిస్థాయిలో అవగాహనలు కల్పించాలని వివరించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎం.ఏ.రశీద్, వికారాబాద్ డీఎస్పీ సంజీవరావు, తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, జిల్లా సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.