ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి
పరిగి : టీఆర్ఎస్ పార్టీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. గురువారం పరిగి మండలం కాళ్లాపూర్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఎన్నిక కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ను ఆదరిస్తున్నారని చెప్పారు. ప్రతి గ్రామంలో కమిటీల ఏర్పాటు ద్వారా పార్టీ మరింత పటిష్టవంతంగా మారుతుందన్నారు. కాళ్లాపూర్ టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మహేందర్, ఖుదావంద్పూర్ సుబ్బారెడ్డి, జాఫర్పల్లి సత్యనారాయణరెడ్డి, నర్సయ్యగూడెం వెంకట్రాములు ఎన్నికయ్యారు.
కార్యక్రమాలలో మార్కెట్ చైర్మన్ సురేందర్, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆంజనేయులు, సీనియర్ నాయకులు ప్రవీణ్కుమార్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, నార్మాక్స్ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి, రాఘవాపూర్ సర్పంచ్ నల్క జగన్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.