పరిగి : ప్రతి ఒక్కరు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సూచించారు. గురువారం పరిగిలోని ఆరోగ్య ఉపకేంద్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్డ్రైవ్ను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్యతో కలిసి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేయాలని సర్కారు స్పెషల్ డ్రైవ్ చేపడుతుందన్నారు. ప్రతి ఆరోగ్య ఉపకేంద్రంలో వ్యాక్సిన్ వేయడంతో పాటు ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ వేసే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలనే సంకల్పంతో సర్కారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.
అవసరం మేరకు వ్యాక్సిన్ నిల్వలు ఉన్నాయని, ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా రక్షణ పొందవచ్చని చెప్పారు. అన్ని గ్రామాల్లో, పట్టణాల్లోని వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.