రఘునాథపాలెం, మే 2: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించి వాటిని బాహ్య ప్రపంచంతో అనుసంధానం చేసి అక్కడి ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించినప్పుడే నిజమైన గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాల అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. పల్లెలకు వెళ్లే రహదారులను బీటీలుగా మారుస్తూ రోడ్లకు నూతన శోభను తీసుకువస్తోంది. రఘునాథపాలెం మండలంలోని ప్రధాన రహదారులకు మహర్దశ పట్టింది. సింగిల్ రోడ్లుగా ఉన్న ప్రధాన రహదారులన్నీ డబుల్ లైన్గా రూపాంతరం చెందనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ రఘునాథపాలెం మండలంలోని నాలుగు ప్రధాన రహదారుల విస్తరణకు రూ.14.72 కోట్ల నిధులు మంజూరు చేయించారు. ఒకప్పుడు సింగిల్ రోడ్ల నిర్మాణానికే దిక్కులేకుండా ఉండే రోడ్లన్నీ.. కేసీఆర్ సర్కారులో డబుల్ లైన్గా మారుతునున్నాయి. పీఎంజీఎస్వై కింద మంత్రి పువ్వాడ అజయ్కుమార్ 25 కిలోమీటర్ల పరిధి వరకు డబుల్ లైన్గా విస్తరించేందుకు రూ.14.72 కోట్లు మంజూరు చేయించారు. ఈ నిధులతో మండలంలోని నాలుగు ప్రధాన రహదారులు డబుల్ రోడ్లుగా విస్తరించుకోనున్నాయి. సింగల్ రోడ్లను డబుల్గా విస్తరించేందుకు నిధులు మంజూరు కావడంతో మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మంజూరైన పనులు పొడవు నిధులు
వేపకుంట్ల చింతగుర్తి, మల్లేపల్లి, గడ్డికుంటతండా మీదుగా మంచుకొండ వరకు 7.02 కిలోమీటర్లు రూ.343.50 కోట్లు
జింకలతండా క్రాస్ రోడ్డు నుంచి జింకలతండా, మల్లేపల్లి, రాములుతండాల మీదుగా పంగిడి రోడ్డు వరకు 7.20 కిలోమీటర్లు రూ.450.40 కోట్లు
రఘునాథపాలెం జన్మభూమి రోడ్డు నుంచి వీ వెంకటాయపాలెం వరకు 3.96 కిలోమీటర్లు రూ.315.30 కోట్లు
చింతగుర్తి నుంచి కొర్లబోడు తండా, రాంక్యాతండా, వాంకుడోతు తండా మీదుగా సూర్యాతండా వరకు 6.18 కిలోమీటర్లు రూ.362.30 కోట్లు