షాబాద్ : షాబాద్ మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చల్లా మాధవరెడ్డిని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పరామర్శించారు. ఇటీవల మాధవరెడ్డి తండ్రి చల్లా నర్సింహారెడ్డి గుండెపోటుతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శుక్రవారం షాబాద్కు వచ్చి వారి నివాసంలో నర్సింహారెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట నాయకులు హస్మత్పాషా, వెంకటయ్య, గాదం సత్తయ్య, కావలి కృష్ణయ్య, గాండ్ల పరుశావేది, రామస్వామి, సాజిత్, రవి తదితరులు ఉన్నారు.