పెద్దేముల్ : మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన కోట్ల మైసమ్మ దేవాలయంలో ఆదివారం మాజీమంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి స్థానిక నాయకులతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దేముల్ గ్రామ ప్రజలను కోట్ల మైసమ్మ అమ్మవారు చల్లగా చూసి వర్షాలు పడి, పాడి పంటలు సంమృద్ధిగా పండేలా చూడాలని కోరానని పేర్కొన్నారు.
అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు శాలువాలు, పూలమాలతో ఎమ్మెల్సీని సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ నారాయణరెడ్డి, పెద్దేముల్ సొసైటీ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్రెడ్డి, గ్రామ పెద్దలు జితేందర్రెడ్డి, నరేష్ రెడ్డి, మాజీ మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు డివై నర్సింహులు, నాయకులు ఎర బాలప్ప, రంగయ్య, రాఘవేందర్ రెడ్డి, రాములు, వెంకటయ్య, సంజీవ్రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.