వికారాబాద్ : భారీ వర్షాలకు శంకర్పల్లి మండలం కొత్తపల్లి ఎల్లమ్మ వాగులో కారులో గల్లంతై మృతి చెందిన మోమిన్ పేట్ మండలం ఎన్కతల గ్రామానికి చెందిన వెంకటయ్య కుటుంబ సభ్యులను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించి ఓదార్చారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధైర్యపొడొద్దు అండగా ఉంటామని భరోసానిచ్చారు. మంత్రి వెంట ఎంపీ రంజిత్ రెడ్డి ,ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ ఉన్నారు.