కొడంగల్ : గిరిజనులు కలగా ఉన్న బంజారభవన్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించడంతో పాటు రూ. 1కోటి మంజూరు చేసినందుకు గాను మంత్రి సత్యవతి రాథోడ్కు కొడంగల్ బంజారులు ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో మంత్రిని కలిసి సన్మానించారు. వెనుబడ్డ కొడంగల్లో తండాలకు రోడ్డు సౌకార్యాలు, వాగులపై వంతెన నిర్మాణాలు జరగకపోవడం వల్ల ఇబ్బందుల ఎదుర్కొంటున్నట్లు గిరిజన నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
స్పందించిన మంత్రి సౌకర్యాలు సమకూర్చేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శంకర్నాయక్, గోవింద్, సంత్ సేవాలాల్ సంఘం అధ్యక్షుడు గౌరవ అధ్యక్షడు దేశ్యానాయక్, టీటీ రామునాయక్, గిరిజనులు పాల్గొన్నారు.