పరిగి : రైతులకు మార్కెట్యార్డులో అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు మార్కెట్ కమిటీ కృషి చేస్తుందని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. శుక్రవారం పరిగి మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్కు వచ్చే రైతులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు నూతన పాలకవర్గం దృష్టి సారించాలని రానున్న రోజుల్లో రైతులకు తక్కువ ధరకే భోజనం అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దోమ జడ్పీటీసి నాగిరెడ్డి, పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ అంతిగారి సురేందర్కుమార్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సమీర్, పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కర్ పాల్గొన్నారు.