నమస్తే తెలంగాణ యంత్రాంగం : జిల్లా వ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. రుద్రూర్ పీహెచ్సీలో 49 మందిని పరీక్షించగా 8 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని డాక్టర్ దిలీప్ తెలిపారు. రుద్రూర్-3, పాత వర్ని-1, వర్ని-1, రాయకూర్-1, బొప్పాపూర్-1, అంబం-1 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. ఫస్ట్ డోస్ కరోనా వ్యాక్సిన్ 40 మందికి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మోపాల్ మండలంలో 46 మందికి పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని డాక్టర్ నవీన్ తెలిపారు. మండలంలో మొత్తం 60 మందికి టీకా వేశామని తెలిపారు. వర్ని సీహెచ్సీలో 54 మందికి పరీక్షలు నిర్వహించగా.. 18 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్యాధికారి వెంకన్న తెలిపారు. 92 మందికి టీకా వేశామని తెలిపారు. చందూర్ పీహెచ్సీలో 40 మందిని పరీక్షించగా ఏడుగురికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యిందని వైద్యాధికారి స్వప్న తెలిపారు. ధర్పల్లి ప్రభుత్వ దవాఖానలో 188 మందికి మొదటి దఫా, నలుగురికి రెండో దఫా వ్యాక్సినేషన్ వేసినట్లు మెడికల్ ఆఫీసర్ రఘువీర్ తెలిపారు.
మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 60 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 20 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని, ఇందులో ధర్పల్లికి చెందిన 8, సీతాయిపేట్కు చెందిన 3, వాడికి చెందిన ఒకరు, దుబ్బాకకు చెందిన 6, గోవిందుపల్లికి చెందిన ఇద్దరు ఉన్నారని పేర్కొన్నారు. జక్రాన్పల్లి పీహెచ్సీలో 50 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 14 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని మండల వైద్యాధికారి రవీందర్ తెలిపారు. 99 మందికి టీకా వేశామని చెప్పారు. ఆర్మూర్ ఏరియా దవాఖాన, హౌసింగ్ బోర్డులోని ప్రైమరీ హెల్త్ సెంటర్, మండలంలోని దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో మొత్తం 25 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యులు నాగరాజు, అయేషా ఫిర్దోస్, భాస్కర్రావు తెలిపారు. ఆర్మూర్ దవాఖానలో 192 మందికి, ప్రైమరీ హెల్త్ సెంటర్లో 284 మందికి, దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 135 మందికి కరోనా టీకాలు వేసినట్లు హెల్త్ సూపర్వైజర్లు అర్గుల్ సుభాష్, ఆనవాల, అనురాధ, చంద్రశేఖర్ తెలిపారు.
కమ్మర్పల్లి మండలంలోని చౌట్పల్లి పీహెచ్సిలో 47 మందికి కొవిడ్ టెస్టులు నిర్వహించగా 14 మందికి పాజిటివ్ వచ్చింది. 62 మందికి టీకాలు వేశారు. కమ్మర్పల్లి పీహెచ్సీలో 47 మందికి టెస్టులు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్ వచ్చింది.156 మందికి కొవిడ్ టీకాలు వేశారు. మోర్తాడ్ సీహెచ్సీలో బుధవారం 50 మందికి కొవిడ్ టెస్టులు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని, 128 మందికి వ్యాక్సిన్ వేశామని డాక్టర్ సుమంత్ తెలిపారు.రెంజల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కందకుర్తి సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన కొవిడ్ -19 పరీక్షా కేంద్రాల్లో గురువారం 43 మందికి పరీక్షలు నిర్వహించగా, 15 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. బోధన్ ప్రభుత్వ దవాఖాన నుంచి కొవిడ్ పరీక్షల కేంద్రాన్ని బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మార్చారు.
కాగా, బుధవారం జిల్లా ప్రభుత్వ దవాఖానలో 125 మందికి పరీక్షలు నిర్వహించగా 27 మందికి, పాన్గల్లీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 46 మందికి పరీక్షలు నిర్వహించగా 5గురికి పాజిటివ్గా వచ్చినట్లు ఆయా దవాఖానల వైద్యాధికారులు తెలిపారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 50 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 13 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు. భీమ్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం 39 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా మందికి 17 కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యుడు అజయ్పవార్ తెలిపారు. 88 మంది కరోనా టీకా తీసుకున్నట్లు తెలిపారు.