మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారు జాము నుంచే మహాదేవుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. హరహర మహాదేవ… శంభో శంకర అన్న నినాదాలతో శివాలయాలు మార్మోగాయి. త్రినేత్రుడిని దర్శించుకుని పూజలు చేసిన అనంతరం ఉపవాస దీక్షలు విరమించారు. మహేశ్వరంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పరమేశ్వరుడికి క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. పలుచోట్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పైలెట్ రోహిత్రెడ్డి, జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు నీలకంఠుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జాగారాలు చేసే భక్తుల కోసం పలు శివాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మంగళవారం శివాలయాలు ఓం నమ ః శివాయ.. శంభో శంకర.. హరహర మహాదేవ అంటూ శివనామస్మరణతో మార్మోగాయి. ఉదయం నుంచే భక్తులు పరమశివుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శివుడికి అత్యంత ఇష్టమైన బిల్వపత్రంతో స్వామి వారిని పూజించారు. శివలింగానికి అభిషేకాలు, అర్చనలు చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు అన్ని వసతులు కల్పించారు. ఫ్రూట్ మార్కెట్ల వద్ద జనం బారులు తీరారు.
– న్యూస్నెట్వర్క్, నమస్తేతెలంగాణ, మార్చి 1