వికారాబాద్ : వరద నీటి ప్రవాహంలో కొట్టుకపోయి మృతి చెందిన చాకలి శీను కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి సబితాఇంద్రారెడ్డి కుటుంభానికి భరోసా కల్పించారు. మంగళవారం పుల్మామిడి గ్రామానికి వెళ్లి మృతుడి కుటుంబాన్ని చేవెళ్ల ఎంపి రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి పరామర్శించారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇంటి నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. పిల్లలు బాగా చదువుకోవాలని సూచించారు. ప్రభుత్వం తరపున అందించే పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఎంపి రంజిత్రెడ్డి తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న వాగులవద్దకు ప్రజలేవరు వెళ్లకూడదని వారు సూచించారు. వీరి వెంట ఎంపీపీ భవానీ, సర్పంచ్ విమలరంగారెడ్డి, ఎంపీటీసీ తేజశ్విని రామకృష్ణ, ఉప సర్పంచ్ సుధాకర్ ఉన్నారు.