కోట్పల్లి : మండలంలో అడిషనల్ కలెక్టర్ మోతీలాల్ శుక్రవారం పర్యటించి మొక్క నాటారని తాసిల్దార్ అశ్పక్రసూల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్పల్లి మండల మీదుగా బంట్వారం వెల్లిన అడిషనల్ కలెక్టర్ మోతీలాల్ తిరిగి వచ్చే క్రమంలో కోట్పల్లి తాసిల్దారు కార్యాలయాన్ని సందర్శించారు. ధరణి పోర్టల్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ విషయంపై ఎవైనా ఇబ్బందులు ఉన్నాయా.. అంటూ అడిగి తెలసుకున్నారు. అనంతరం కార్యాలయ ఆవరణలో తాసిల్దార్ అశ్పక్రసూల్తో కలిసి మొక్కను నాటారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.