కొడంగల్, ఏప్రిల్ 27: కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొడంగల్ నియోజకవర్గంలో కట్టడికి అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం స్థానిక ఆర్అండ్బీ అథితిగృహంలో అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించి కరోనా పరిస్థితిపై ఆరా తీశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్, ఆరోగ్య, పోలీసు శాఖల అధికారులు సమన్వయంతో వైరస్ ఉధృతిపై ప్రజలకు అవగాహన కల్పించి వీధుల్లో శానిటైజేషన్ పనులు చేపట్టాలని సూచించారు.డీఎంఅండ్హెచ్వోతోఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి తెలంగాణ బార్డర్ మండలంలోని కస్తూర్పల్లి ప్రాం తంలో ప్రత్యేకంగా చెక్పోస్టును ఏర్పాటు చేయాలని కోరారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వలస కూలీలు తప్పకుండా కొవిడ్ టెస్ట్ చేయాలని సూచించారు. అనంతరం ఇటీవలే కరోనాతో మృతి చెందిన టీటీవీ రిపోర్టర్ శహబాజ్పాషా చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించారు. స్థానిక రిపోర్టర్లు శహబాజ్పాషా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి, వైస్ చైర్మన్ ఉషారాణి, కౌన్సిలర్లు మధుసూదన్యాదవ్, డా. శ్రీలతాయాదవ్, ప్రభాకర్గౌడ్, సరోజతో పాటు ఆరోగ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
కొడంగల్, ఏప్రిల్ 27: మండలంలోని రావులపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మహ్మద్ అబ్దుల్ టీఆఎస్ పార్టీ సభ్యత్వాన్ని పొంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల లబ్ధిదారు కుటుంబ సభ్యులు భార్య అజీరాబేగానికి రూ.2లక్షల చెక్కు ను ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అందించారు.