కడ్తాల్ : మండల పరిధిలోని ముద్విన్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయస్థాయి పెన్కాక్ సిలాట్ టోర్నికి ఎంపికైన్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. 2019లో హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పెన్కాక్ సిలాట్ పోటీలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన తేజ, కావ్య, ప్రశాంత్, శివమనోహర్లు, ఈ నెల 24న హర్యానాలో నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని వారు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ నర్సింహ, మాస్టర్లు సతీశ్కుమార్, మహేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.