షాద్నగర్టౌన్ : ఫరూఖ్నగర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 18 సంవత్సరాలు నిండిన ఎస్సీ మహిళలందరూ ఉచిత కుట్టుమిషన్ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ శరత్బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్కార్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టుమిషన్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ ఉచిత కుట్టుమిషన్ శిక్షణ మూడు నెలలు పాటు ఇచ్చి అనంతరం ఉచితంగా కుట్టుమిషన్ అందజేయనున్నట్లు తెలిపారు. ఉచిత శిక్షణపై ఆసక్తి ఉన్న మహిళలు ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని ఎస్సీ మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.