మాస్కు ధరిస్తే కరోనాను నియంత్రించవచ్చని హైదరాబాద్ ఈఎన్టీ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ జీవీఎస్ రావు అన్నారు. ఆదివారం మహాత్మాగాంధీ బస్స్టేషన్,కింగ్ కోఠి, కాచిగూడ రైల్వేస్టేషన్,కేపీహెచ్బీ బస్స్టాండ్లలో వినూత్న రీతిలో ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు లక్ష మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాస్కులను,మజ్జిగను,ఆహార ప్యాకెట్లను,తాగునీటిబాటిళ్లను ఫుట్పాత్లపై ఉన్నవారికి,బస్టాండ్లోని ప్రయాణికులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాస్కు ధరించకపోతే 90శాతం కొవిడ్ బారిన పడే అవకాశం ఉందన్నారు.దీన్ని విస్మరించడం వల్లే ప్రతి ఇంట్లో కరోనా విలయ తాండవం చేస్తున్నదని చెప్పారు. లక్షణాలు ఉంటే వెంటనే నిర్ధ్దారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కరోనా టీకాలు అందరికీ ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.