పరిగి, అక్టోబర్ 19 : ప్రతి పేదవారికి సర్కారు సహాయం అందుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. మంగళవారం పరిగిలోని తన నివాసంలో సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ కింద 18 మందికి రూ.6,51,000, ముగ్గురికి ఎల్వోసీలు రూ.6,50,000 మొత్తం రూ.13.01లక్షలకు సంబంధించిన చెక్కులు, ఎల్వోసీ కాపీలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందాలన్నది సర్కార్ ఉద్దేశమని చెప్పారు. సర్కారు దవాఖానల బలోపేతం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రైవేటు కార్పొరేట్ దవాఖానలలో చికిత్సలు పొందిన వారికి సీఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక సహాయం అందుతుందని ఆయన పేర్కొన్నారు.
ప్రతి పేద కుటుంబానికి సహాయం అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, సీనియర్ నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, నార్మాక్స్ డైరెక్టర్లు రాంరెడ్డి, వెంకట్రాంరెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్గుప్తా తదితరులు పాల్గొన్నారు.