షాబాద్, జనవరి 20: ఇంటింటికీ తిరిగి జ్వర సర్వే నిర్వహించాలని, వ్యాక్సినేషన్ వందశాతం పూర్తికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు జిల్లా కలెక్టర్లు, వైద్య అధికారులకు సూచించారు. గురువారం ఆయన హైదరాబాద్ నుంచి రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి కొవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లాల కలెక్టర్లు, వైద్య అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ దేశం లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ మాట్లాడుతూ జిల్లాలో రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వందశాతం పూర్తికి చర్యలు తీసుకుంటున్నామని, జిల్లా జనరల్ దవఖానతోపాటు అన్ని పీహెచ్సీలు, కమ్యూనిటీ, ఏరియా దవఖానల్లోనూ కొవిడ్ రోగులకు చికిత్సలు అం దించడం జరుగుతుందన్నారు. ఇంటింటికీ తిరిగి జ్వర సర్వే చేపట్టి, కొవిడ్ లక్షణాలు ఉన్న వారికి మెడికల్ కిట్లను అందించడంతోపాటు ప్రతిరోజూ వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తామని, కొవిడ్ కేర్ సెంటర్ను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. 15-17 ఏండ్లలోపు ఉన్న పిల్లలకు ఇప్పటివరకు 63,051 టీకాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, జడ్పీ సీఈవో దిలీప్కుమార్, డీపీవో శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
కొవిడ్ కట్టడికే జ్వర సర్వే
కొవిడ్ కట్టడికి శుక్రవారం నుంచి ఇంటింటికీ తిరిగి జ్వర సర్వే నిర్వహించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సూచించారు. గురువారం ఆయన హైదరాబాద్ నుంచి రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి కొవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లాల కలెక్టర్లు, వైద్య అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ జ్వర సర్వేను గ్రామాలు, మున్సిపాలిటీల్లోని వార్డుల వారీగా నిర్వహించాలని సూచించారు. సర్వే సందర్భంగా దగ్గు, జ్వ రంతో బాధపడుతున్న వారికి హోం ఐసొలేషన్ కిట్లు అందించాలని, ఐసొలేషన్ కిట్లు తీసుకున్న వారి ఆరోగ్య పరిస్థితిని ప్రతిరోజూ పర్యవేక్షించాలన్నారు. ఫ్రంట్లైన్ వారియర్స్లు బూస్టర్ డో సు తీసుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ సౌకర్యంతో కూడిన కొవిడ్ వార్డులను ఏర్పాటు చేస్తామన్నారు. పోలీసు అధికారు లు ప్రజలందరూ మాస్కులు ధరించేలా చూడాలన్నారు. అనంతరం పంచాయతీరాజ్ శాఖ మం త్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ కొవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా గ్రామానికి ఒక నోడల్ ఆఫీసర్ను నియమించాలని, అధికారులు సమన్వయంతో పనిచేసి ఇంటింటి జ్వర సర్వేను జయప్రదం చేయాలన్నారు.
ఈ సందర్భంగా రా ష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మాట్లాడుతూ కొవిడ్తో మరణించిన వారికి ప్ర భుత్వం చెల్లించే ఎక్స్గ్రేషియాను త్వరగా మం జూరు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసి డాక్టర్లు, సిబ్బందిని నియమించాలన్నారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ జిల్లాలో మొదటి డోసు కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తయిందని, అర్హులను గుర్తించి రెండో డోస్ టీకాను వేస్తున్నట్లు తెలిపారు. ఇం టింటి జ్వర సర్వేను జయప్రదం చేస్తామన్నారు. ఈ కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ చంద్రయ్య, జడ్పీ సీఈవో జానకిరెడ్డి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం పాల్గొన్నారు.