మొయినాబాద్ : రైతులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదుగాలని హెరిటేజ్ డెయిరీ సీఈవో శ్రీనిదికేశవన్ ఆకాంక్షించారు. శుక్రవారం మండల పరిధిలోని కేతిరెడ్డిపల్లి గ్రామాన్ని హెరిటేజ్ సంస్థ ప్రతినిధులతో కలిసి సందర్శించారు. అనంతరం గ్రామంలో కొనసాగుతున్న పాల సేకరణ కేంద్రాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. హెరిటేజ్ ద్వారా రైతులకు అందిస్తున్న సేవల గురించి వివరించాడు.
హెరిటేజ్ ద్వారా పాడి రైతులకు రాయితీలపై దాన, ఇన్సూరెన్స్ అందచేయడంతో పాటు పశువులకు వైద్య పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వెట్ప్లస్ ఆప్ గురించి వివరించారు. పశుపోషణలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎతుబార్పల్లి, తోలుకట్టాలో శంకర్పల్లిలోని హెరిటేజ్ సీసీ వారు ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో హెరిటేజ్ జోనల్ హెడ్ సత్యనారాయణ, రీజినల్హెడ్ సర్వోత్తంరెడ్డి, ఏరియా మేనేజర్ వెంకటేశం, శంకర్పల్లి మేనేజర్ కుమార్ పాల్గొన్నారు.