దౌల్తాబాద్ : ఆనారోగ్యతంతో బాధపడుతున్న అభాగ్యులకు ఎల్ఓసీ అపద్బాంధువగా ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. కొద్ది రోజులుగా ఆనారోగ్యంతో అసుపత్రిలో చికిత్స పొందుతున్న దౌల్తాబాద్ మండలం సురైపల్లి గ్రామానికి చెందిన పి. అనిల్ తండ్రి అనంతప్పకు రూ. 3 లక్షలు, పి. భారతమ్మ తండ్రి చిన్న అనంతప్పకు రూ. 3లక్షలు ఎల్ఓసీ మంజూరు చేయించి వారిద్దరికి చెక్కులను శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదాలకు దవాఖాన ఖర్చుల నిమిత్తం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పేదా ప్రజలకు ఆర్థిక స్థోమత లేని పేదాలకు సీఎం రిలీఫ్ ఫండ్ సేవాలను వినియోగించుకోవాలని సూచించారు.