యాలాల : అభివృద్ధి కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య అన్నారు. బుధవారం యాలాల మండల పరిధిలోని గంగాసాగర్, సంఘాయిపల్లి తండా, సంఘాయిగుట్ట తండా, బానాపూర్, బెన్నూర్, లక్ష్మీనారాయనపూర్ గ్రామాల్లో నిర్మిస్తున్న వైకుంఠధామాలను ఆయన డీఎల్ఓపీ చంద్రశేఖర్రావు, ఏపీవో జనార్దన్, ఎంపీడీవో పుష్పలీల, డిప్యూటీ ఈఈ కరునాకర్ చారి, ఎంపీవో మహేష్ కుమార్లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతున్నామన్నారు. సర్పంచ్లు, కాంట్రాక్టర్లు త్వరితగతిన మిగిలిన పనులను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు.