కులకచర్ల, ఆగస్టు 8 : ఆదివారం అమావాస్య సందర్భంగా కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం దేవాలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం అమావాస్య కావడంతో గుండంలో స్నానం చేసి స్వామివారిని దర్వించుకుంటే సర్వపాపాలు పోతాయని భక్తులు ఉదయం నుంచే రామలింగేశ్వరస్వామిని దర్శించచుకోవడానికి వందల సంఖ్యలో దేవాలయానికి వచ్చారు. భక్తులకు సౌకర్యం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు దేవాలయ కమిటీ చైర్మన్ రాములు చేశారు.