పెద్దేముల్ : తెలంగాణ ప్రభుత్వం 57 ఏండ్ల లోపు వయస్సున్న ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లను అమలు చేస్తున్న నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజలు మీ-సేవా కేంద్రాల వద్ద దరఖాస్తు చేసుకోవడానికి బారులు తీరారు. ముఖ్యంగా పెద్దేముల్ మండల కేంద్రంలో బుధవారం స్థానిక మీ-సేవా కేంద్రాలకు జనాలు భారీగా తరలివచ్చారు. దీంతో మీ-సేవా కేంద్రాలు, ఆన్లైన్ సెంటర్లు కిక్కిరిసిపోయాయి.
తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 19, 2018 సంవత్సరంలోపు ఎవరైతే 57 సంవత్సరాల నుంచి 64 ఏండ్ల వయస్సు నిండి ఉంటారో అలాంటి వారు ఆసరా పింఛన్ల కోసం మీ-సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నెల చివరి వరకు దరఖాస్తు గడువు ఉందని తెలిపారు. అందరూ ఒకే రోజు పెద్ద మొత్తంలో మీ-సేవా కేంద్రం వద్ద గుమిగూడడంతో మీ-సేవా ప్రాంగణం కిక్కిరిపోయింది. మరోవైపు ప్రభుత్వం ఆసరా పింఛన్ల దరఖాస్తులకు మీ-సేవా కేంద్రాల్లో సైతం ఎలాంటి రుసుము పెట్టకపోవడంతో ఆయా గ్రామాల జనాలు మీ-సేవా కేంద్రం వద్ద దరఖాస్తు చేసుకోవడానికి బారులు తీరారు.