తాండూరు రూరల్ : గంజాయి కేసులో ముద్దాయికి రూ. 8వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తాండూరు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి స్వప్న తీర్పు ఇచ్చారని కరణ్కోట ఎస్సై ఏడుకొండలు ఒక ప్రకనటనలో తెలిపారు. తాండూరు మండలం, గౌతాపూర్ – చెంగోల్ రోడ్డులో మల్లేశం అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తుండగా పట్టుకొని అప్పటి ఎస్సై కేసు నమోదు చేశారు. కోర్టులో వాదోపవాదనలు అనంతరం న్యాయమూర్తి నిందితుడికి రూ. 8వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారని ఎస్సై తెలిపారు.