మర్పల్లి : విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పాఠశాలలను ప్రారంభించడం జరిగిందని అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. బుధవారం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో మండలంలోని సిరిపురం, మర్పల్లి పాఠశాలలను ఎంపీడీవో వెంకట్రామ్గౌడ్తో కలిసి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పాఠశాలలను ప్రారంభించడం జరిగిందన్నారు. ఇన్ని రోజులు ఇంటివద్ద ఉన్నారు కదా ఎలా అనిపించింది, మీ అమ్మ నన్నా పాఠశాలలకు వెళ్లేందుకు అంగికరించారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని విద్యార్థులకు సూచించారు.
ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో శానిటైజర్ అందుబాటు లో ఉంచాలని, మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని సూచించారు. అనంతరం ఆదివారం తిమ్మాపూర్ వాగులో కొట్టుకుపోయి ముగ్గురు బయటపడి ఇద్దరు మృతి చెందిన స్థలాన్ని సందర్శించారు. ఆయన వెంట సర్పంచ్ మల్లయ్య, పంచాయతీ కార్యదర్శులు, నాయకులు ఖలీమొద్ధీన్, అబ్రహం ఉన్నారు.