కొడంగల్, డిసెంబర్ 01 : నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని అంగడిరైచూర్ గ్రామానికి చెందిన ఆశమ్మకు సీఎంఆర్ఎఫ్ పథకం కింద మంజూరైన రూ.లక్షా 50వేల ఎల్వోసీ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నేటి రోజుల్లో వైద్యం చాలా ఖరీదు అయిందన్నారు.
ఆర్థికంగా వెనుకబడిన వారు వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఉందన్నారు. అలాంటి వారికి ముఖ్యమంత్రి సహాయనిధి పథకం వరంగా మారిందన్నారు. కార్యక్రమంలో చిట్లపల్లి సర్పంచ్ వెంకట్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ బాల్సింగ్నాయక్, మాజీ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గోడల రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.