వికారాబాద్ : పాఠశాలలోని అన్ని తరగతి గదులను తప్పనిసరిగా శుభ్రం చేయాలని వికారాబాద్ కలెక్టర్ పౌసుమిబసు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల లు, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. పట్టణంలోని 31, 32 వార్డుల్లో వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించారు. శానిటేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 1నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నందున విద్యార్థుల కు ఎలాంటి అసౌకర్యం కలుగకుండ ఉండేందుకు పారిశుధ్య పనులను చేపట్టాలన్నారు.
ప్రతి తరగతి గదిలో విద్యుత్, నీటి సదుపాయం ఉండేలా చూసుకోవాలని సూచించారు. నీటి సదుపాయం కోసం మిషన్ భగీరథ అధికారులను సంప్రదించాలన్నారు. ఏ ఒక్క విద్యార్థికి కూడా ఇబ్బంది కలుగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ ఇంటి పైకప్పుపై నీరు నిలువ కుం డా చూసుకోవాలన్నారు. విరిగిన ప్లాస్టిక్ డబ్బాలు, ట్యూబ్లు నీటితొట్టెలలో నీరు నిలువకుండ ఎప్పటి కప్పుడు పరిశుభ్రంగా ఉంచుకొని డెంగీ బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలని ప్రజలకు సూచించారు. పార్కుల వద్ద అపరిశుభ్రంగా ఉండడంతో మున్సిపల్ అధికారులను వెంటనే పారిశుధ్యం పనులు చేపట్టాలని ఆదేశించారు.
32వ వార్డులో గల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద అపరిశుభ్రంగా ఉండడంతో వెంటనే శుభ్రం చేయిం చాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. వ్యాధులు ప్రబలకుండా ప్రతి రోజు మున్సిపల్ పరిధిలో పారిశుధ్య పనులు చేపట్టి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ శరత్చంద్రను ఆదే శించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేశ్, మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర, డీఈవో రేణుకాదేవి, డీడబ్ల్యూవో లలితకుమారి, విద్యుత్ శాఖ ఇంజినీర్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.