ధారూరు : చాకలి ఐలమ్మ జయంతి పురస్కరించుకుని ఆదివారం చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్లు ఎంపీ నివాసంలో ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తెగువను ప్రపంచానికి చాటి చెప్పిన వీరానారీమని చాకలి ఐలమ్మ అని తెలిపారు. మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీర వనితగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.