బొంరాస్పేట : జిల్లా ఎస్పీ నారాయణ గురువారం సాయంత్రం కొడంగల్ పోలీసు స్టేషన్ను సందర్శించారు. మండలంలోని అంగడిరాయిచూరు గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో సాగు చేస్తున్న గంజాయి మొక్కలను బుధవారం పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. స్టేషన్లోని గంజాయి మొక్కలను ఎస్పీ పరిశీలించి సాగు చేస్తున్న రైతు వివరాలను అడిగి తెలుసుకున్నారు. గంజాయిని సాగు చేసిన వ్యక్తి పరారిలో ఉన్నాడని త్వరలో పట్టుకుంటామని సీఐ అప్పయ్య ఎస్పీకి తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రషీద్, ఎస్ఐ సామ్యానాయక్ పాల్గొన్నారు.