ఆమనగల్లు : కొవిడ్-19 విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహించిన జర్నలిస్టుల సేవలు అందరికి స్ఫూర్తిదాయకం అని హ్యూమన్ రైట్స్క్లబ్, పారా ఆర్గనైజేషన్ కో-ఆర్డినేటర్ కొమ్ము తిరుపతి అన్నారు. ఆదివారం సంస్థ ఆమనగల్లు బ్లాక్ మండలాలకు చెందిన పలువురు జర్నలిస్టులు, ఫొటో గ్రాఫర్లకు కొవిడ్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్-19ను దృష్టిలో పెట్టుకొని ఫ్రంట్లైన్ వారియర్స్గా జర్నలిస్టులను గుర్తించాలని ఆయన కోరారు.
కరోనా మహమ్మారి పట్ల ప్రజలను చైతన్యం చేయడంలో మీడియా పాత్ర ఆమోఘం అని ఆయన పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్యుల సలహాలు, సూచనలు, వ్యాక్సిన్ పై ప్రజల్లో ఉండే మూఢ నమ్మకాలు, అపోహలను తొలగించడంలో మీడియా గొప్ప పాత్ర పోషిస్తుందన్నారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో తమ కుటుంబాలకు దూరంగా ఉండి ప్రజలకు వార్తలను అందించడంలో జర్నలిస్టులు ముందు వరుసలో నిలిచారని వారి సేవలు అభినందనీయం అని ఆయన గుర్తు చేశారు. వారు చేసిన సేవలను గుర్తించి సంస్థ తరపున మెడికల్ కిట్టును వితరణ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రమణారెడ్డి, జర్నలిస్టులు, యూనిస్, మాసుమ్, శేఖర్, ఆజీమ్, అమిద్, నిరంజన్, ఫొటో గ్రాఫర్ కలీం, అల్లాజీ, సంస్థ డైరెక్టర్ స్వప్నపాల్గొన్నారు.